అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన ఎం.నారాయణప్ప అనే రైతుకు ‘కర్మవీర చక్ర’ పురస్కారం లభించింది. ప్రకృతి వ్యవసాయంతో ఏడాది పొడవునా నిరంతరం ఆదాయం పొందవచ్చని నిరూపించినందుకు గాను ఆయన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. ఐక్యరాజ్య సమితి, ఆర్ఈఎక్స్, కర్మ వీర్ గ్లోబల్ ఫెలోషిప్ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీఓస్ (ఐకాంగో) ఏటా అంతర్జాతీయ స్థాయిలో కర్మవీర చక్రను ప్రదానం చేస్తోంది









