దేశంలో మరో కీలక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వన్యప్రాణి సంరక్షణలో భాగంగా 2,300 చదరపు కి.మీ విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం మధ్యప్రదేశ్లోని నౌరదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభ్యయారణ్యాలను కలపనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది.









