దేశ ప్రధాని నరేంద్ర మోడీ దుబాయ్లో జరుగుతున్న కాప్-28 సదస్సుకు శుక్రవారం హాజరయ్యారు. ఈ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. 2028లో జరగాల్సిన ‘కాప్-33’ సదస్సును భారత్లో నిర్వహిస్తామని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. ప్రపంచ జనాభాలో ఇండియా జనాభా 17 శాతం ఉందని, కానీ ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో భారత్ నుంచి విడుదలయ్యేది కేవలం 4 శాతమేనని ఆయన అన్నారు.









