నవంబర్ 3వ తేదీ నుండి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్ ?
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోతే బంద్ తప్పదని హెచ్చరిక జారీ చేసిన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఆ దిశగా కార్యాచరణకు పూనుకున్నట్టు తెలియ వచ్చింది.
గతంలో హా మీ ఇచ్చినట్లుగా నవంబర్ 1వ తేదీ లోపు రూ.900 కోట్ల నిధులు విడుదల చేయాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి
ఈ విషయమై ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వినతిపత్రం అందజేశారు.ఇది ఇలా ఉండగా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అత్యవసర భేటీ అయ్యాయి.ఈ నేపథ్యంలో దసరా లోపు రూ.600 కోట్లు చెల్లిస్తామని చెప్పి, ఈ రోజు రూ.200 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించినట్టు పేర్కొన్నారు.తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో మరోసారి కాలేజీలను బంద్ చేసే యోచనలో యాజమాన్యాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ,ఆ దిశగా ప్రభుత్వ సలహాదారు కేశవరావుకు వినతి పత్రాన్ని అందజేశారు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు.









