రోడ్డు ప్రమాదంలో బి ఎస్ ఎఫ్ జవాన్ మృతి.
ఆరుగురికి తీవ్ర గాయాలు…గాయపడ్డ జవాన్లను ఆసుపత్రికి తరలింపు…
చింతూరు అక్టోబర్ 21 టుడే 9 ప్రతినిధి.
చింతూరు మండలంలోని చట్టి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సుకు చెందిన జవాన్ మృత్యు వాత పడ్డారు.అదే వాహనంలో ప్రయాణిస్తున్న ఇతర జవాన్లు తీవ్రగాయాల పాలైన సంఘటన మంగళవారం మద్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బీ ఎస్ ఎఫ్ కు చెందిన ఏడుగురు జవాన్లు ఖమ్మం నుంచి బలిమెల కు వెళుతుండగా చింతూరు మండలంలోని చటి గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాద వశాత్తూ కల్వర్టును ఢీకొంది .ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మిగిలిన వారికి తీవ్రగాయాలు అయ్యాయి.ప్రమాదంలో గాయపడ్డ జవాన్లను హుటాహుటిన హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.









