మా కాలనీ సమీపంలో బార్, బెల్ట్ షాప్ లు తొలగించండి….ఐటీడీఏ పిఓకు వైయస్సార్ నగర్ వాసులు వినతి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 27:టుడే 9 ప్రతినిధి
పట్టణంలోని ఐటీడీఏకు ఎదురుగా ఉన్న వైయస్సార్ కాలనీ సమీపంలో బార్. బెల్ట్ షాపులు ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ఈ క్రమంలో ఈ ప్రాంతంలో వీటిని ఇక్కడి నుంచి ఎత్తివేయాలని కోరుతూ భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ బి.రాహుల్ కు వైయస్సార్ నగర్ వాసులు సోమవారం ఐటీడీలో జరిగిన గిరిజన దర్బార్లో వినతి పత్రం అందజేశారు. గుడి, బడి పక్కనే ఉన్నా ఈ ప్రాంతంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని పిఓ దృష్టికి తీసుకువచ్చారు. గిరిజన మ్యూజియం ఇటీవల ఆధునికరించడం జరిగిందని ఈ ప్రాంతంలో యాత్రికులు, భక్తులు, విద్యార్థినీ విద్యార్థులు, స్థానికులు నిత్యం సంచరిస్తుంటారని మద్యం దుకాణాలు ఈ ప్రాంతంలో ఉండటం వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి బార్,బెల్ట్ షాపులు ఇక్కడి నుంచి ఎత్తివేయాలని పి.ఓకు విన్నవించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పిఓఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు దల్లి చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తోటమల్ల బాలయోగి, కార్యదర్శి కటారి కృష్ణారావు, గౌరవ సలహాదారులు జి. రవి, తోకల చిన్న పాపయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు









