దివ్యాంగుల చట్టం 2016 పోస్టర్లు ఆవిష్కరించిన.జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.

దివ్యాంగుల చట్టం 2016 పోస్టర్లు ఆవిష్కరించిన.జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 27:టుడే 9 ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు భద్రాద్రి ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల చట్టం 2016 పోస్టర్ల విడుదల కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ. దివ్యాంగుల చట్టం 2016 92/ఏ ప్రకారం దివ్యాంగులను కించపరిచినా,అవహేళనలుగా మాట్లాడినా, అవయవ లోపాలను ఎగతాళి చేసినా, దివ్యాంగులనుగాయపరిచినా,కించపరిచినా,అసభ్య పదజాలంతో అవమానపరిచినా,అదే విధంగా దివ్యాంగుల పరికరాలను ధ్వంసం చేసినా,ఆరునెలలనుండి,రెండు సంవత్సరాలవరకు జైలుశిక్ష విధించబడుతుందని, పదివేల రూపాయల నుండి ఐదులక్షలవరకు, జరిమానా విధించబడుతుందని ఆయన తెలిపారు.సమాజంలో దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని, దివ్యాంగుల చట్టం 2016 పై అతి త్వరలో సంబంధించిన జిల్లా అధికారులతో అవగాహన సదస్సునిర్వహించడం జరుగుతుందని,తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భద్రాద్రి ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఊటుకూరి సాయిరాం, కార్యదర్శి అన్నం సత్తిబాబు, ఉపాధ్యక్షులు కిస్టా శ్రీనివాస రావు వాల్మీకి, ఎమ్మార్పీఎస్ మాజీ నాయకులు సామాజిక ఉద్యమ నాయకులు అలవాలరాజా పెరియార్, పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి అధ్యక్షులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు, అప్పన్న దాసు బాబు, మద్దెల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share