గ్రామ పంచాయతీ తాళాలు పగలగొట్టి నామినేషన్ పత్రాలు చోరీ..

గ్రామ పంచాయతీ తాళాలు పగలగొట్టి నామినేషన్ పత్రాలు చోరీ చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.తాండూర్ నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ తాళాలు పగలగొట్టి నామినేషన్ క్లస్టర్ లో ఉన్న నామినేషన్ పత్రాలను గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

ఈ పరిణామంతో ,గొట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జయరాం తండా(ఐ) గ్రామాలకు సర్పంచ్ వార్డు మెంబర్ల నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. నామినేషన్ పత్రాలు డేటా స్కాన్ చేసి ఉంచామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు, పోలీసులు అభ్యర్థులను సముదాయించారు.మరోవైపు ఒరిజినల్ నామినేషన్ పత్రాలు లేకపోవడంతో భద్రతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram