•ఎమ్మెల్యే భరత్రెడ్డి సన్నిహితుడి కాల్పులు
•గన్మన్ తుపాకీ లాక్కుని రెండు రౌండ్ల కాల్పులు జరిపిన సతీష్రెడ్డి
•తప్పించుకున్న మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి.
బళ్లారి లో మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటులో వివాదం చెలరేగిన ఘటనలో గాలి జనార్ధన రెడ్డి తృటిలో తప్పించుకున్నారు.కాగా పరస్పరం కాల్పులు జరిపిన కారణంగా ఒకరు మృతి చెందారు.మరొక వ్యక్తికి గాయాలయ్యాయి.
కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది…వివరాల్లోకి వెళితే తన ఇంటి ప్రహరికి ఫ్లెక్సీలు కట్టొద్దని చెప్పినందుకు, బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరుడు గాలి జనార్ధన్ రెడ్డి, అతని అనుచరులపై కాల్పులు జరిపారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని హవంబావి ప్రాంతంలో ఒక కార్యక్రమానికి సంబంధించి గాలి జనార్ధన్ రెడ్డి ప్రహరికి ఫ్లెక్సీలు కట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి ప్రయత్నించారు.
ఫ్లెక్సీలు ఇంటి ప్రహరికి వద్దని, బయట కట్టుకోవాలని సతీష్ రెడ్డికి , గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు సూచించారు. దీంతో గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి ముందు కుర్చి వేసుకుని కూర్చున్న సతీష్ రెడ్డి, నేను ఫ్లెక్సీలు ఇక్కడే కడతానని.. ఎవడు ఆపుతాడో చూస్తా అని అనడంతో, ఇరువర్గాల మధ్య మొదలైన రాళ్ల దాడి మొదలయ్యింది.అదే సమయంలో ఇంటికి వచ్చిన గాలి జనార్ధన్ రెడ్డి గన్ మెన్లు ఉద్రిక్తతను ఆపేందుకు గాల్లోకి కాల్పులు జరపగా, ఒక గన్ మెన్ నుండి తుపాకీ లాక్కొన్న సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డి వైపు కాల్పులు జరిపారు . దీంతో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు రాజశేఖర్ రెడ్డి మృతి చెందగా,సతీష్ రెడ్డి బుల్లెట్ గాయంతో తప్పించుకున్నారు. కాగా కాల్పుల నుండి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడిన,గాలి జనార్ధన్ భరత్ రెడ్డి అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటన అనంతరం స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో, పెద్ద ఎత్తున రంగంలోకి దిగి ఇరు వర్గాలను పోలీసులు అదుపు చేశారు…అనంతరం ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా చూసేందుకు 144 సెక్షన్ విధించారు.








