మొండికుంట అటవీప్రాంతంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో, పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. విద్యార్థులతో ప్రయాణిస్తున్న కాలేజీ బస్సు మణుగూరు నుంచి పాల్వంచ వెళ్తుండగా ఘటన జరిగింది.బస్సులో ఇరుక్కున్న విద్యార్థులను బయటకు తీసేందుకు రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
మణుగూరు నుంచి పాల్వంచ వెళుతున్న KLR ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన బస్సు మొండికుంట అడవి ప్రాంతంలో బోల్తా పడింది…కాగా బస్సులో సుమారుగా 60 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం అందుతోంది.. గాయపడిన వారిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే సంఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు సందర్శించి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.








