107 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో.. గాయాల పాలైన 20 మంది విద్యార్థులు..
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్ పాడు గ్రామ శివారులోని కాలువలో వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన శ్రీ వివేకానంద పాఠశాల స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రమాద సమయంలో బస్సులో 107 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం అందుతుంద.. తీవ్ర గాయాలపాలైన 20 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. కాగా కాలువలో నీళ్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది ఇలా ఉంటే పరిమితికి మించి విద్యార్థులతో ప్రయాణిస్తుండడంతోనే అదుపు తప్పి కాలువలో పడి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.








