భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 23
టుడే 9 ప్రతినిధి
వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భద్రాచలం వాసవి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ రేపాక సాయి అఖిల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఎంతో ఆనందదాయకమని, అన్నారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలోని అన్ని వర్గాలకు సంతోషాన్ని కలిగించేదిగా ఉందని అన్నారు.
ఇలాంటి నిర్ణయాలు సాంప్రదాయాలకు, సంస్కృతికి మరింత ప్రాధాన్యతను చాటుతాయని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య అభినందనీయమని తెలిపారు.









