దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్పైనే ఉంది. తాజా సమాచారం ప్రకారం, పార్ట్-2 కు సంబంధించిన పనులు ఇప్పటికే శరవేగంగా సాగుతున్నాయి. మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే దాదాపు 20 నుంచి 30 శాతం మేర సీక్వెల్ షూటింగ్ను కూడా పూర్తి చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
మిగిలిన కీలక సన్నివేశాల చిత్రీకరణను వచ్చే ఏడాది (2027) ద్వితీయార్థం నాటికి పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అత్యంత కీలకం కావడంతో, షూటింగ్తో పాటే సమాంతరంగా గ్రాఫిక్ పనులు కూడా జరుగుతున్నాయి. మొదటి భాగంలో చూపించిన అద్భుతాల కంటే రెట్టింపు స్థాయిలో పార్ట్-2 లో యాక్షన్ మరియు విజువల్స్ ఉండబోతున్నట్లు సమాచారం.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, 2027 డిసెంబర్ నాటికి ఈ భారీ సీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వైజయంతీ మూవీస్ భావిస్తోంది. రెండో భాగంలో ప్రభాస్ (కర్ణుడు), కమల్ హాసన్ (యాస్కిన్) మధ్య జరిగే మహా ఘర్షణ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే పాత్రలకు కూడా ఈ సీక్వెల్లో మరింత ప్రాధాన్యత ఉండబోతోంది.









