కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ అంశంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నిజాయితీ నిరూపించుకోండి బండి సంజయ్ సానుభూతి కోసం ప్రయత్నించకుండా, తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల విషయంలో నిష్పక్షపాత విచారణకు సహకరించాలని పొన్నం సూచించారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిగా చట్టాన్ని గౌరవించి, ఆదర్శంగా నిలవాలని ఆయన హితవు పలికారు. ప్రభుత్వం ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని ఆయన స్పష్టం చేశారు.
మహిళా అధికారి నేతృత్వంలో విచారణ తెలంగాణ ఆడబిడ్డల రక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడదని, బాధితురాలికి అండగా నిలుస్తామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కేసును ఒక మహిళా డీసీపీ స్థాయి అధికారికి అప్పగించినట్లు వెల్లడించారు. రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి, చట్టం తన పని తాను చేసుకుపోయేలా సహకరించాలని బండి సంజయ్కు కౌంటర్ ఇచ్చారు.









