ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తన సింగపూర్ పర్యటనలో ప్రొఫెషనల్ లుక్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. సాధారణంగా సింపుల్ డ్రెస్సింగ్లో ఉండే ఆయన, ఈ పర్యటనలో సూటు బూటు ధరించి కొత్త అవతారంలో దర్శనమిచ్చారు. కేవలం రూపంలోనే కాకుండా, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలోనూ ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారు.
మైస్ (MICE) ఎకోసిస్టమ్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ వ్యాపార వేదికగా మార్చే లక్ష్యంతో సింగపూర్లోని ప్రఖ్యాత సన్టెక్ సిటీని లోకేష్ సందర్శించారు. అక్కడ మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, మరియు ఎగ్జిబిషన్స్ (MICE) నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై కీలక చర్చలు జరిపారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి నగరాల్లో ప్రత్యేక ఫెసిలిటేషన్ బ్యూరోలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
భారీగా పెరగనున్న హోటల్ గదుల సామర్థ్యం రాష్ట్రంలో పర్యాటక మరియు వ్యాపార రంగాన్ని బలోపేతం చేసేందుకు రాబోయే ఐదేళ్లలో హోటల్ గదుల సామర్థ్యాన్ని 20,000కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అమరావతిలో 4 కన్వెన్షన్ సెంటర్లకు ఆమోదం లభించిందని, విశాఖను ప్రపంచ స్థాయి మైస్ డెస్టినేషన్గా తీర్చిదిద్దుతామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో విస్తరిస్తున్న తరుణంలో, ఏపీని గ్లోబల్ ఈవెంట్లకు కేరాఫ్ అడ్రస్గా మార్చడమే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.









