మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. బాలీవుడ్ బ్యూటీ, నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విడుదల చేసిన ‘పెద్ది’ అఫీషియల్ ట్రైలర్కు మెజారిటీ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. కన్నడ స్టార్ హీరో, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి మాత్రం ఈ ట్రైలర్పై ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఇచ్చిన రివ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
‘పెద్ది’ ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేసిన రిషబ్ శెట్టి.. సినిమా విజువల్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుతూ, “ప్రతి ఫ్రేమ్లోనూ రామ్ చరణ్ అబ్సల్యూట్ ఫైర్ చూపించారు. ఆయన లుక్ చాలా స్టన్నింగ్గా ఉంది” అని కొనియాడారు. దీంతో పాటు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ నటన పాత్రకు తగిన గాంభీర్యాన్ని, సినిమాకు ఒక ప్రత్యేకమైన లేయర్ను జోడించిందని ప్రశంసించారు. హీరోయిన్ జాన్వీ కపూర్ ఎంతో అందంగా, వైబ్రంట్గా కనిపించిందని చెప్తూ.. దర్శకుడు బుచ్చిబాబు వర్క్ను ‘ఎక్స్లెంట్’ అంటూ రిషబ్ శెట్టి అభినందించారు.
విజయనగరంలోని ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెట్, కుస్తీ మరియు పరుగు పందేలలో పాల్గొనే ఒక పవర్ఫుల్ గ్రామీణ యువకుడిగా కనిపించబోతున్నారు. తమ ఊరి ప్రజల కోసం ‘పెద్ది’ చేసిన పోరాటం ఏంటి? అతను దేశం తరఫున జాతీయ స్థాయి పోటీలకు ఎలా వెళ్లాడు? అనే ఆసక్తికరమైన క్రీడా, గ్రామీణ అంశాలతో ఈ చిత్రం రూపొందింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు. రిషబ్ శెట్టి ప్రశంసలకు గానూ ‘పెద్ది’ చిత్ర యూనిట్ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.









